ఊరేగింపుగా అయోధ్య రామ అక్షింతల వితరణ

ఊరేగింపుగా అయోధ్య రామ అక్షింతల వితరణ

శాయంపేట, ముద్ర : అయోధ్య రామ  మందిరం ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు శ్రీ రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో మండలంలోని పత్తిపాక గ్రామంలో ఊరేగింపుగా  నగర సంకీర్తన చేస్తూ గడప గడప కి అక్షింతలు వితరణ చేయడం జరుగుతుందని హన్మకొండ  జిల్లా అధ్యక్షుడు మాందడి రాజు, శాయంపేట మండల కార్యదర్శి తడుక సదానందం తెలిపారు. 

వారు మాట్లాడుతూ...
శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం పూజారి రాజు చే పూజ చేసి ఆలయం నుండి శ్రీ రామ ఆంజనేయ భజన మండలి భక్తులు ఉదయం 6:00 గంటలకు వాడ వాడ భక్తి గీతాలు ఆలపిస్తూ తీరుగుతామని తెలిపారు. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ద్వారా 500మంది వేద పండితులచే పూజించిన అక్షింతలని తెలిపారు. గ్రామంలో అందరూ భక్తులు పాల్గొనాలని స్వామి వారికి హరతులతో స్వాగతం పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి భక్తులు కూనూరి రాజు, నాముతాబాజీ శ్రీధర్, తడుక రవి,కుసుమ రమేష్, గజ్జి మహేందర్, వైద్యుల ప్రభాకర్ రెడ్డి, పింగిలి సాంబారెడ్డి, అంబాల మల్లయ్య, వైద్యుల రాంరెడ్డి, తుడుం కుమారస్వామి, నాలికే శంకర్, పాల్గొన్నారు.