యాదవుల సంక్షేమానికి గొర్రెల పంపిణీ
రెండో విడత గొర్రెలను పరిశీలించిన : జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు
ముద్ర, ఎల్లారెడ్దిపేట :యాదవుల సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని రెండో విడత పంపిణీ చేసిన గొర్రెలను జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రెండవ విడత గొర్రెలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీలో భాగంగా 51 యూనిట్లు మంజూరు అయ్యాయని 4 యూనిట్ల గొర్రెలు మండలానికి తీసుకువచ్చారన్నారు.
యాదవులందరు ఈ గొర్రెల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల పశు వైద్యాధికారిని రేణుక కు పలు సూచనలు చేస్తూ వర్షాకాలంలో గొర్రెలకు వ్యాక్సిన్లు సమయం ప్రకారం ఇవ్వాలని,ఇట్టి గొర్రెలు చాలా దూరం నుండి తీసుకురావడం వలన ట్రాన్స్ పోర్టు సమయంలో ఏవైనా గొర్రెలు చనిపోయినచో వాటిని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించవలసిందిగా ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారిని రేణుక, సర్పంచ్ తెడ్డు అమృత రాజమల్లు, యాదవ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు చిర్రం నాగరాజు యాదవ్, సిరికొండ నాగరాజు, యాదవ సంఘం నాయకులు మానుక దేవయ్య , వట్టెల అశోక్, బొల్లు పరశురాములు, వట్టెల పద్మ, గంటయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.