సీఎం కేసీఆర్​ను ఈడీ విచారించింది

సీఎం కేసీఆర్​ను ఈడీ విచారించింది

సీఎం కేసీఆర్​ను ఈడీ విచారించిందని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.  ఆ విషయం బయటకు రాకుండా  చేశారన్నారు. దొంగ పాస్​పోర్టు కేసు, కేంద్ర మంత్రిగా సహారా స్కామ్​ ఉన్నాయన్నారు.  వాటిని ఎందుకు విచారణ చేయడంలేదు? వీటిపై బీజేపీ సర్కారు ఎందుకు విచారణ జరపడంలేదు? ఫామ్​హౌజ్​ కేసు ఎందుకు జాప్యం అవుతోంది?  అని ఆయన ప్రశ్నించారు.