పురుగుల మందు తాగి  వృద్ధ దంపతుల ఆత్మహత్య 

పురుగుల మందు తాగి  వృద్ధ దంపతుల ఆత్మహత్య 

ముద్ర,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని ఆసిరెడ్డి పల్లె గ్రామంలో భార్యా భర్తలైన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ప్రజలు తెలిపిన కథనం ప్రకారం  గత సంవత్సరం నుండి కొడుకులు ,కోడళ్లతో ఆస్తి తగాదాల వల్ల గొడవలు జరుగుతున్నాయని అలాగే పెద్దకొడుకు ,  కోడలు ఇంటిలో ఉన్న కుల దైవాన్ని తీసుకుని ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్తున్నాము అని అనడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెప్తున్నారు.  స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ కేసు  నమోదు చేసుకొని , మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు  తెలిపారు