జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో - రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో - రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల నుండి వడ్ల కొనుగోళ్లు, మిల్లులకు తరలింపులోని జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రైతులు సోమవారం ఆందోళనలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా వారి నిరసనలకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జామ్, ఆలూరు, చించోలి హైవేపై రాస్తా రోకో లో రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. ఆందోళన విరమింప చేయడానికి పోలీసులు, ఎమ్మార్వో ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో చివరకు జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.