విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
అమరావతి, ముద్ర వార్తలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
తాజాగా విశాఖలోనూ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు అంటించింది జీవీఎంసీ. ఎండాడలోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసులలో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్, జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసలు అంటించడంతో చర్చనీయాంశంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు
ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం
జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడం పై వివరణ… pic.twitter.com/cd4RURJ052