గల్ఫ్కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తవిస్తా
![గల్ఫ్కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తవిస్తా](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64fdb6e038980.jpg)
అవకాశం ఇవ్వండంటున్న పన్నీర్ నరేందర్
జగిత్యాల అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కార్యాలయంలో దరఖాస్తు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గల్ఫ్ కార్మికుల పక్షాన అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తేందుకు తనకు జగిత్యాల నుంచి అవకాశం కల్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ పన్నీర్ నరేందర్ బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ బాధితులు ఎక్కువగా ఉంటారని వారి పక్షాన అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తడానికి గల్ఫ్ సమస్యలపై అవగాహన కలిగిన, జగిత్యాల ప్రాంతానికి చెందిన తన అభ్యర్థిత్వం ఖరారు చేయాలని కోరారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలని చాలామంది అభ్యర్థులు బీజేపీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నారు.