అటవీ ప్రాంతాల పరిరక్షణకు  ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

అటవీ ప్రాంతాల పరిరక్షణకు  ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

4కే ర‌న్ లో పాల్గొన్న మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : అటవీ ప్రాంతాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. పట్టణ, నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ కోసం ఫారెస్టు బ్లాకుల్లో అర్బన్ లంగ్స్ స్పేస్ (అర్బన్ ఫారెస్టు పార్కులు) అభివృద్ధి చేస్తున్నామనిన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేశామనన్నారు.

ఆదివారం హైదరాబాద్ శివారు మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వరంలో నిర్వహించిన 4కే రన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు నడక సరైన మార్గంగా వైద్యులు నిపుణలు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.