గుండె నిండా గులాబీ జెండా

గుండె నిండా గులాబీ జెండా
  • ఊరు వాడలో ఎగరాలి జెండా
  •  నియోజకవర్గ సమావేశాలను విజయవంతం చేయాలి
  • ఒక్కో నియోజకవర్గం లో 3000 వేల కార్యకర్తలతో  సమావేశం
  •  ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో సన్నాక సమావేశం
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సుమారు 3000 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవాలని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. బుధవారం కరీంనగర్ లోని మంత్రి నివాసంలో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే లు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావులతో ఈనెల 25న నిర్వహించే నియోజకవర్గ సమావేశం గురించి  మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  తెలంగాణలోని ప్రతీ కార్యకర్త గుండె నిండా గులాబీ జెండా నిలువై  ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డు, ఊరిలో ఇప్పటికే జెండా గద్దెల నిర్మాణం పూర్తయిందని  నిర్మాణం కానీ చోట  గద్దెల నిర్మాణం చేపట్టి ఈనెల 25న ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో, గ్రామాల్లో అయితే గ్రామ శాఖ ఆధ్వర్యంలో గులాబీ జెండా ఎగురవేసి పార్టీ సమావేశానికి ముఖ్య కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3000 నుండి 5000వేల ముఖ్య కార్యకర్తలు హాజరై సమావేశాలను విజయవంతం చేయాలని అన్నారు.

ఆయా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జడ్పిటిసి, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు సమన్వయంతో సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో  రాజశ్రీ గార్డెన్, మానకొండూర్  నియోజకవర్గం  సుప్రీం ఫంక్షన్ హాల్, చొప్పదండి నియోజకవర్గం సమావేశం గంగాధర మండల కేంద్రంలో ని బిఏఎస్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశాలు ఉదయం 10 నుండి 1  గంటల వరకు జరుగుతాయని భోజన విరామం తర్వాత కూడా సమావేశం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్ రసమయి బాలకిషన్ లతోపాటు జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎంపీపీలు పిల్లి శ్రీలత మహేష్, తిప్పర్తి లక్ష్మయ్య జడ్పిటిసి లు, పురమల్ల  లలిత -శ్రీనివాస్, పిట్టల- కరుణా రవీందర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ  జడ్పీ కో ఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, కాసారాపు శ్రీనివాస్, బారసా  నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ , దూర్షెడ్ పాక్స్ చైర్మన్ గొనె నర్సయ్య  కొ -అప్షన్ సభ్యులు సాబీర్ పాషా, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, సుడా డైరెక్టర్ తిరుపతి  నాయక్ తదితరులు ఉన్నారు.