గణేష్ ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు 

గణేష్ ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తు 
  • రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ 

ముద్ర, మల్కాజిగిరి :  18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేశ్​చతుర్థి ఉత్సవాలకు  కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు.  సఫిల్ గూడ చెరువు, కాప్రా చెరువును గురువారం సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వారికి దిశ నిర్దేశం చేశారు. నిమజ్జనం సందర్భంగా చెరువు సమీపంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం గణేశ్ నిమజ్జనం జరిగే చోట టెంట్లు, విద్యుత్‌ లైట్లను, బారికేడ్లను నిర్మించాలన్నారు. మంచి నీటి సౌకర్యం, మొబైల్  టాయిలెట్ల ఏర్పాటు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.