విద్యా,వ్యవసాయ రుణాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి

విద్యా,వ్యవసాయ రుణాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి
  • ఎస్సీ, ఎస్టీ యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్ యస్. మోతీలాల్
  • ఉపాథి కల్పన పెంపొందించుటకు బ్యాంకర్లు సహకరించాలి
  • వ్యవసాయ రుణాల సంఖ్య పెంపొందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలి
  • పెండింగ్ వీధి వ్యాపారుల రుణాలు త్వరితగతిన అందించాలి
  • రైతు రుణాలను రెన్యూవల్ చేసుకునేలా అవగాహన కల్పించాలి
  • ఆయిల్ ఫాం సాగు ప్రోత్సాహకానికి బ్యాంకర్లు సహకరించాలి
  • మహిళా సంఘాల రుణాలు లక్ష్యాలను ప్రతిమాసం పూర్తి చేయాలి

 ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టి సబ్సిడీ యూనిట్ల గ్రౌండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ సభావట్ మోతిలాల్ సంబంధిత అధికారులను బ్యాంకర్లను ఆదేశించారు .
 ఎస్సి ఎస్టీ కార్పోరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై బుధవారం  డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు.

 ప్రజలు ఆర్థికంగా ఎదిగేందకు అవసరమైన సహకారం బ్యాంకింగ్ రంగం అందించాలని, అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ కోరారు. వ్యవసాయ రంగానికి సంబంధించి  రూ.4348 కోట్ల రుణం మంజూరి చేయడం లక్ష్యం కాగా ఇప్పటివరకు చివరి వరకు రూ.2709 కోట్లు 62.32% రుణాలు రైతులకు అందించామని అధికారులు తెలిపారు.రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురొగతి సాధించాల్సి ఉందని, రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు లక్ష్యాల చేరుకోకపోవడం పై బ్యాంకుల వారిగా అదనపు కలెక్టర్ సమీక్షించారు.వ్యవసాయ, ఉన్నత విద్యా కోసం విద్యా రుణాలను అందించి బ్యాంకర్లు ప్రోత్సహించాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో 2022-23 సంవత్సరానికి గాను మహిళా సంఘాల రుణాలకు రూ. 465.43 గాను  9671  స్వశక్తి సంఘాలకు  రూ.466.47 కోట్లు రుణాలు 100.22% అందించామని, అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మహిళా సంఘాలకు రుణ లక్ష్యం చేరుకోవాలని, ప్రస్తుత సంవత్సరం 12030 సంఘాలకు అధికశాతం రుణం అందించడం లక్ష్యం పెట్టుకొని ప్రణాళికాబ్దంగా ప్రతి మాసం లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్ అన్నారు 

ఎస్సి కార్పోరేషన్ రుణాలపై సమీక్షిస్తూ   యూనిట్ల సబ్సిడి విడుదల అయినప్పటికి ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసిన వారి  యూనిట్లను గ్రౌండ్ చేసేలా బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు యువతకు స్వయం ఉపాధి పెంపొందించడానికి  జిల్లాలో డిజీటల్ పేమెంట్స్ అధికంగా వుండేలా చుడాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని  సూచించారు.
 జిల్లాలో  చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు సహకారం అందించాలని తెలిపారు. జిల్లాలో అర్హులై దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారులకు రుణం మంజూరు చేసి నగదు అందించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం ఆర్ సత్యనారాయణ, డి ఎం నాబార్డ్ అఖిల్, ఆర్బిఐ ఎల్డిఓ డెబోజిత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, జిల్లా పరిశ్రమల అధికారి రవి కిరణ్, పిడిడిఆర్డిఏ నర్సింగరావు,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవి రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డిఈవో గోవిందరాజులు బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు