మోదీపై డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకున్న  జే.ఎన్.యూ. అధికారులు

మోదీపై డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకున్న  జే.ఎన్.యూ. అధికారులు
JNU cancels screening of BBC documentary on PM Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి జె.ఎన్.యూ. విద్యార్థులు చేసిన  ప్రయత్నాన్ని యూనివర్సిటీ అధికారులు భగ్నం చేశారు. డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం నిషేధించినందున యూనివర్సిటీ అధికారులు దాన్ని ప్రదర్శించడానికి  అనుమతి ఇవ్వలేదు.

మంగళవారం రాత్రి 9 గంటలకు డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని , ఈ ప్రదర్శన యూనివర్సిటీ చట్టాలకు విరుద్ధం కాదని విద్యార్థులు వాదిస్తూ వచ్చారు. అయితే సరిగ్గా ప్రదర్శన సమయానికి విద్యుత్ సరఫరాను, ఇంటర్నెట్ ను నిలిపివేయడం ద్వారా యూనివర్సిటీ అధికారులు ప్రదర్శనను అడ్డుకున్నారు.