కాకతీయ సేవా సమితి కమ్మ సంఘం మణికొండ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

కాకతీయ సేవా సమితి కమ్మ సంఘం మణికొండ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు

కాకతీయ సేవా సమితి కమ్మ సంఘం మణికొండ వారి ఆధ్వర్యంలో అప్పా జంక్షన్ వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... జంట నగరాల్లో మొట్టమొదటిసారిగా దాదాపు 16 వేలమందికి పైగా హాజరై కార్యక్రమాన్ని అత్యద్భుతంగా విజయవంతం చేశారని. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, గాలిపటాలు కోడి పందాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారని అన్నారు.

ఈ సందర్భంగా సమాజంలో ఉన్నత స్థితికి చేరుకున్న కమ్మవారైనా మాగంటి మురళీమోహన్. కోడే దుర్గాప్రసాద్, చల్లా రాజేంద్రప్రసాద్, కెవి చౌదరి, డాక్టర్ కూరపాటి కృష్ణయ్య, డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, భారతీయం సత్యవాణి, డాక్టర్ కొసరాజు సుచరిత, శ్రీ గూడూరు సత్యనారాయణ, వంటి వారిని సన్మానించుకున్నారు.

వీరు సమాజానికి చేస్తున్న సేవను కొనియాడారు. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహించినందుకు కాకతీయ సేవా సమితి మణికొండ ..సంధ్య కన్వెన్షన్ .. కోడికూర చిట్టిగారి రెస్టారెంట్ వారిని అభినందించారు.