సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా - ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 

సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా  - ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలోని గ్రామపంచాయతీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రామయ్య తో పాటు పలువురు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొని వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే గారికి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని అన్నారు