సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నూతన భవనానికి త్వరలో ప్రారంభోత్సవం

సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నూతన భవనానికి త్వరలో ప్రారంభోత్సవం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నూతన భవనానికి త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  మంగళవారం సాయంత్రం స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు తో కలిసి నాగర్ కర్నూల్ లో కొత్తగా నిర్మించిన ఐ.డి. ఒ.సి. ఎస్పీ కార్యాలయ భవనాలను పరిశీలించారు.  సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం, ఎస్పీ కార్యాలయంలో చాలా చక్కగా నిర్మితమైంది అని సంతృప్తి వ్యక్తం చేశారు.  స్టేట్ ఛాంబర్, కలెక్టర్ ఛాంబర్ లను పరిశీలించారు.

విద్యుత్, ఫర్నిచర్, పరిసర శుభ్రత అన్ని పూర్తి అయ్యాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని పూర్తి అయినందున రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించి త్వరలో ప్రారంభోత్సవానికి ముహూర్తం తేది ఖరారు చేస్తామని తెలియజేశారు. ఆ లోపు ఇంకా చిన్న చిన్న పనులు, గార్డెనింగ్ పనులు ఏమైనా ఉంటే పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, ఎం.పి. పోతుగంటి రాములు, ఎస్పీ కే. మనోహర్,  అదనపు కలెక్టర్ మోతీలాల్,  ఆర్.అండ్ బి  కార్యనిర్వహక ఇంజనీరు భాస్కర్,  జడ్పీటిసి లు, ఎంపిపి లు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.