కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ముద్ర ప్రతినిధి ,నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో 5 మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మీ - షాది ముబారక్ పథకంలో భాగంగా 213 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డీవో రామిరెడ్డి జడ్పిటిసి, రోహిణి , సుమిత్ర, కౌన్సిలర్లు శ్రీను, సునెంద్ర, నిజం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.