మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి పాటుపడాలి లక్కారంలో నూతన కమిటీ ఎన్నికల్లో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
![మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి పాటుపడాలి లక్కారంలో నూతన కమిటీ ఎన్నికల్లో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652bd715a0451.jpg)
ముద్ర ముత్తారం:- మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి పాటుపడాలని లక్కారంలో నూతన కమిటీ ఎన్నికల్లో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. మండలంలోని లక్కారం గ్రామంలో మున్నూరు కాపు సంఘ నూతన కమిటీని ఆదివారం గ్రామంలోని కాపు సంఘం భవనంలో ఎన్నికను నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా బర్ల రాజు, ఉపాధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, కోశాధికారి పసునూటి లింగయ్య, సహాయ కార్యదర్శి ఒద్ది భూలక్ష్మీ, ప్రధాన కార్యదర్శి దేవరకొండ బుచ్చయ్య, కార్యదర్శి బర్ల రాజేందర్, కార్యవర్గ సభ్యులు పసునూటి శ్రీనివాస్, బర్ల సదానందం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పుట్ట మధుకర్ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.