కంటి వెలుగు కార్యక్రమం ను ప్రారంభించిన మేయర్ జక్క

కంటి వెలుగు కార్యక్రమం ను ప్రారంభించిన మేయర్ జక్క
Mayor Jakka started the Kanti Velugu program

మేడిపల్లి, ముద్ర : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11, 12వ డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత  కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ డా. పి. రామకృష్ణ రావు, కార్పొరేటర్లు మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, డి ఈ ఈ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, ఏ ఈ బిక్షపతి, టీ పి ఎస్ రాజీవ్ రెడ్డి, నాయకులు చెరుకు పెంటయ్య, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, రాజరాజు, డాక్టర్ ప్రతిభ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.