ఏ ఐ ఎఫ్ బి లో చేరిన మృత్యుంజయం

ఏ ఐ ఎఫ్ బి లో చేరిన మృత్యుంజయం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది

కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కటుకం మృత్యుంజయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు లోపాయి కార ఒప్పందంతో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ రెండు రోజుల క్రితమే బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ బండ సురేందర్ రెడ్డి, కటకం మృత్యుంజయం కలకత్తా వెళ్లారు. ఏఐఎఫ్ జాతీయ కార్యదర్శి దేవ రాజన్ ను కలిసి సంప్రదింపులు జరిపారు. అనంతరం బండ సురేందర్ రెడ్డి నేతృత్వంలో జాతీయ కార్యదర్శి మృత్యుంజయం కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో మారుతున్న రాజకీయ సమీకరణాలకు మృత్యుంజయం చేరిక హాట్ టాపిక్ గా మారింది.