రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ ల సత్తా చూపిస్తాo...

రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ ల సత్తా చూపిస్తాo...

ముద్ర, మల్యాల:-రాష్ట్రoలొ 60 లక్షల జనాభా కల్గిన ముదిరాజ్ సామజిక వర్గానికి ఈ ప్రభుత్వంలొ ప్రతి చోట అన్యాయం జరుగుతుందని మేపా జిల్లా వైస్ ప్రెసిడెంట్, మండలం ముదిరాజ్ సంఘo అధ్యక్షుడు బొజ్జ నర్సయ్య ఆరోపించారు. గురువారం మల్యాలలొ ముదిరాజ్ సంఘ సభ్యులు హైదరాబాద్ లొ జరగబోయే ప్లీనరీ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నర్సయ్య మాట్లాడుతూ చట్టసభల్లో అవకాశం కల్పించని ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేవిధంగా, రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని అన్నారు. రాష్ట్రoలోని అన్ని గ్రామాలలో ఉన్న ముదిరాజ్ లు ఐకమత్యoతొ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలొ యూత్ అధ్యక్షుడు దొంతరవేణి శేఖర్, మల్లేశం, నీలo రవి, గడుగు రఘు, అంజన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.