మల్యాల నూతన సిఐ గా నీలం రవి బాధ్యతలు

మల్యాల నూతన సిఐ గా నీలం రవి బాధ్యతలు

మల్యాల ముద్ర : మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నీలం రవి బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఐజి కార్యాలయం హైదరాబాద్ కు బదిలీ కాగా, వరంగల్ ఏసీబీ కార్యాలయంలో విధులు నిర్వహించిన నీలం రవి బదిలీపై మల్యాల సిఐ గా నియమితులయ్యారు. మల్యాల ఎస్ఐ గా గతంలో విధులు నిర్వహించిన ఆయన ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మల్యాల కు రావడంతో పలువురు పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు. అంతకు ముందు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భాద్యతలు చేపట్టారు.