పేరూర్ సరస్వతి మాతను దర్శించుకున్న మహిళా చైర్ పర్సన్ సునీతా రెడ్డి

పేరూర్ సరస్వతి మాతను దర్శించుకున్న మహిళా చైర్ పర్సన్ సునీతా రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న గురుడ గంగా మంజీరా పుష్కరాలలో  భాగంగా పేరూర్ సమీపంలో గల సరస్వతి మాతను రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా  సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు దొర్బల రాజమౌళీ శర్మ, గుణాకర్ శర్మ, మహేష్ శర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పూనీతులు కావాలని సూచించారు  అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు. సునీతా రెడ్డిని ఆలయ మర్యాదలతో శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.