తహశీల్దార్ కు వినతిపత్రం

తహశీల్దార్ కు వినతిపత్రం

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి

సైదాపూర్. ముద్ర పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం.చెల్లించాలని కోరుతూ. బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెని రవిందర్ రావు ఆద్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ బావుసింగ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.మండలంలోని 26 గ్రామాల్లో పంటలు సాగు చేసిన రైతులు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పంటలు నష్టపోయారని అలాగే వరి కోతలు కోసి దాన్యం అమ్ముకునేందుకు.సిద్ధంగా ఉన్న రైతులకు.అకాల. వర్షాల వల్ల ధాన్యం.తడిసినా.ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, మిల్లర్లు ఎలాంటి కోతలు లేకుండా వరి ధాన్యమును దిగుమతి చేసుకోవాలని, తడిసి రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.  లో  .కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిష్టయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, వెన్నంపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ సర్పంచులు పోగు రమేష్, దొంత సుధాకర్, మాజీ ఎంపీటీసీ మండల కొమురయ్య, మాజీ డైరెక్టర్ ఎర్రల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు వెల్ది రాజు, మారుపాక తిరుపతి, చల్లూరి రవీందర్, దాసరి సందీప్, కంకణాల చంద్రారెడ్డి, మొలుగూరి రవి, కొంపెల్లి రామకృష్ణ రెడ్డి, పోతరాజు రాములు, తదితరులు ఉన్నారు.