బీహార్ ప్రజల్లో అపనమ్మకాలను కలిగిస్తారా?
- నితీశ్పై ప్రశాంత్ కిషోర్ ఫైర్
పాట్నా: బీహార్సీఎం నితీశ్కుమార్పై జన్ సూరజ్ పాదయాత్ర రూపశిల్పి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విరుచుకుపడ్డారు. సమస్తిపూర్లో పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. వందేళ్లలో ప్రపంచం అంతమవుతుందని ఆయనకెలా తెలుసని ప్రశ్నించారు. సెమీ కండక్టర్అంటే ఏమిటో సీఎం చెప్పాలని, ఒకవేళ ఆయన సరైన అర్థం చెబితే ఆయన చెప్పులు తలపై పెట్టుకోవడానికైనా తాను సిద్ధమేనని ప్రశాంత్ అన్నారు. సెమీకండక్టర్గురించి అడిగితే స్వయానా సీఎం కేబినెట్ మంత్రులకు కూడా తెలియదని విమర్శించారు. ఆయన బీహార్ను ఏ మూలన అభివృద్ధి చేయలేదన్నారు. రూ. 400 వృద్ధాప్య పింఛన్, పదేళ్ల క్రితం సైకిళ్లు పంచి ప్రజలను నిరక్ష్యరాస్యులు, కూలీలుగా మార్చాడని ఆరోపించారు. ఓవైపు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్వైపు అడుగులు వేస్తుండగా సీఎం నితీశ్ మాత్రం బీహార్ ప్రజల్లో మూఢనమ్మకాలను, అపనమ్మకాలను ప్రబలుస్తున్నారని విమర్శించారు. బీహార్ను ఇంకా చీకట్లోనే ఉంచాలని సీఎం భావిస్తున్నారేమో అని దుయ్యబట్టారు. ఇంకా నితీశ్కుమార్ 1960 కాలంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ధోతీ, కుర్తా-పైజామా ధరించి బయటకు వెళ్లినప్పుడు, తామే గొప్ప నాయకులమని నితీశ్ భావిస్తున్నట్టున్నారని విమర్శించారు.