ప్రజా పాలన కార్యక్రమం కాదు..! కాంగ్రెస్ మీటింగ్..?: తలారి శ్రీనివాస్
![ప్రజా పాలన కార్యక్రమం కాదు..! కాంగ్రెస్ మీటింగ్..?: తలారి శ్రీనివాస్](https://mudranews.in/uploads/images/2023/12/image_750x_6590211eafd59.jpg)
తుర్కపల్లి, ముద్ర : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్యారెంటీ పథకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తో పాటు పార్టీ నాయకులను సభావేధికలపై కూర్చోబెట్టడం విడ్డూరంగా ఉందని తుర్కపల్లి మండల బిఆరెస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్ అన్నారు.
శుక్రవారంనాడు మండలంలోని ఆయాగ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్న సందర్భాల్లో అధికారికంగా నిర్వహించాల్సిన సభల్లో పార్టీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకోవడం వల్ల ప్రజలు తమ దరఖాస్తులు ఎవరికివ్వాలి అనే అయోమయంలో ఉన్నారని విమర్శించారు.పార్టీ కార్యక్రమాన్ని తలిపించేలా ప్రభుత్వ కార్యక్రమం ఉందని ప్రజాపాలన కార్యక్రమం పారదర్శకంగా జరిపించాలని,అధికారులు ప్రోటోకాల్ పాటించాలని కోరారు.