ప్రజా సేవకుడు పైల శేఖర్ రెడ్డికే మాదిగల మద్దతు

ప్రజా సేవకుడు పైల శేఖర్ రెడ్డికే మాదిగల మద్దతు

 ముద్ర ప్రతినిధి, బీబీనగర్: అసైన్డ్ భూములపై సాగుదారులకే యాజమాన్యపు హక్కులు కల్పించే బీఆర్ఎస్ పార్టీకే తామంతా ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చిలకమారి గణేష్ మాదిగ తెలిపారు. బీబీనగర్ మండలంలోని జములపేట గ్రామంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ టీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిలకమారి గణేష్ మాట్లాడుతూ, మాదిగ ఉపకులాలన్నీ ఏకమై భువనగిరి అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి కారుగుర్తుపై ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్టిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శంకర్ మాదిగ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుర్పంగి సుగుణ మాదిగ, చిలువేరు జంగమ మాదిగ, పసనాది మణెమ్మ మాదిగ, బీబీనగర్ మండల నాయకులు ఓట్ల యాదగిరి మాదిగ, బండారు శ్రీను మాదిగ బండారి మహేష్ మాదిగ, మిరపకాయల కృష్ణయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.