పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్...

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువునష్టం కేసులో బెయిల్ మంజూరైంది. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ జనతా పార్టీపై అసత్య ఆరోపణలు చేశారని పిటిషన్ దాఖలైంది.ఈ కేసులో బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఇవాళ రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాహుల్ గాంధీకి ఈ కేసులో ఊరట లభించినట్లైంది.