రాజన్న హుండీ ఆదాయం కోటి 63 లక్షలు
![రాజన్న హుండీ ఆదాయం కోటి 63 లక్షలు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e3cf282cb9d.jpg)
ముద్ర, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కి కోటి 63లక్షలకు పైగా హుండీ ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో డి.కృష్ణ ప్రసాద్, కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్లో హుండీ లెక్కించారని తెలిపారు.
అదేవిధంగా102 గ్రాముల 100 మిల్లీ గ్రాముల బంగారం, 11 కిలోల 200 గ్రాముల వెండి లభి లభించినట్లు అధికారులు తెలిపారు. ఏ ఈ ఓ లు విజయ కుమారి, ప్రతాప నవీన్, ఆలయ పర్యవేక్షకులు, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.