సేవాలాల్ ఆలయంలో దొంగల బీభత్సం
![సేవాలాల్ ఆలయంలో దొంగల బీభత్సం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64244c39bcc80.jpg)
ముద్ర కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని భూక్యా రెడ్డి తండాలోగల జై సేవాలాల్ మహారాజ్ ఆలయంలో, గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. అమ్మవారి నగలతో పాటు పుస్తెలతాడు, బుట్టలు,ముక్కుపుడకలను దొంగిలించారు. సంఘటన స్థలానికి పోలీసులు, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.