ఇస్రాయిపల్లికుంట వద్ద మినీ బస్ స్టాప్ ప్రారంభం

ఇస్రాయిపల్లికుంట వద్ద మినీ బస్ స్టాప్ ప్రారంభం

 ముద్ర ప్రతినిధి, బీబీనగర్‌ : బీబీనగర్ గ్రామంలోని ఇస్రాయిపల్లికుంట వద్ద నిర్మించిన మినీ బస్సుస్టాప్ ను బుధవారం జడ్పీటీసీ గోలి ప్రణీత పింగళ్ రెడ్డి, సర్పంచి మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ప్రారంభించారు. పంచాయతీ నాలుగో వార్డు సభ్యులు నెల్లుట్ల ప్రశాంతి శ్రీశైలం ఈ బస్సు స్టాప్ నిర్మాణానికి సహకరించారు.

అలాగే ఆమె ఆర్థిక సహకారంతోనే హనుమాన్ ఆలయం, పోచమ్మ గుడి, కట్టమైసమ్మ గుడి ప్రాంగణాలలో మూడు మినీ నీళ్ల ట్యాంకులు నిర్మించడంతో పాటు, అయిదు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు నెల్లుట్ల ప్రశాంతి శ్రీశైలం ను స్థానికులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ అక్బర్, ఉపసర్పంచి దస్తగిరి, స్థానికులు నెల్లుట్ల రాజు, బస్వయ్య, నెల్లుట్ల శ్రీశైలం, సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.