చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం
- భగ్గుమన్న టీడీపీ నేతలు
- అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
భూదాన్ పోచంపల్లి, ముద్ర : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఆప్రజాస్వామికం అని, చంద్రబాబును అరెస్టు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పతనం మొదలైందని టీడీపీ మండల అధ్యక్షుడు మీసాల నరసింహ అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్న విషయం యావత్ ప్రజానీకం గమనిస్తుందని , ఈ అరెస్టులకు భయపడేది లేదని, రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సంధ్యమోని రాజు, అధికార ప్రతినిధి ఆకుల సత్యం, పట్టణ ఉపాధ్యక్షులు కుక్కలి మహేష్, పట్టణ కార్యదర్శి సుర్కంటి లక్ష్మారెడ్డి, నాయకులు భారత భూషణ్, చెక్క నరసింహ, ఉడుగు సత్యం, సన్న నాగేష్, ఎర్రంశెట్టి సతీష్ ,సిరిపంగి లక్ష్మయ్య, వలందాస్ బక్కయ్య పాల్గొన్నారు.