ఎద్దుల బండిపై వచ్చిన వరుడు
![ఎద్దుల బండిపై వచ్చిన వరుడు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63fb46783a640.jpg)
గుజరాత్లోని సూరత్కు చెందిన బీజేపీ నేత భరత్ వఘాశియా.. తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. ఈ ఊరేగింపును చూసేందుకు ప్రజలు భారీగా గుమిగూడారు. ఇన్ని కార్లున్నా వరుడు మాత్రం ఎద్దుల బండిపై పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. సౌరాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా తన కుమారుడి పెళ్లి ఊరేగింపు ఏర్పాటు చేసినట్లు భరత్ వఘాశియా చెప్పారు.
''సౌరాష్ట్రలో పెళ్లి ఊరేగింపు జరిగినప్పుడు వరుడు ఎద్దుల బండిలో మాత్రమే వెళతాడు. మా పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమిది. నా కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టం. అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించాం. అదే సమయంలో సంప్రదాయాన్నీ కొనసాగించాం'' అని తెలిపారు.