శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి అలయ రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య, ఈఓ సంకటాల శ్రీనివాస్  స్వామివారి చిత్రపటం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

ఈ  కార్యక్రమంలో ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు రమణయ్య, రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్, ఇనగంటి రమ వెంకటేశ్వరరావు, వేముల నరేష్, గందె పద్మ శ్రీనివాస్, చుక్క రవి, పల్లెర్ల సురేందర్, స్థంభంకాడి మహేష్, గునిశెట్టి రవీందర్, సంగెం సురేష్ పాల్గొన్నారు.