Modi cabinet - మోడీ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన నేతలు వీరే...

Modi cabinet - మోడీ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన నేతలు వీరే...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఆదివారం మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. ఢిల్లీ లోని రాజ్​భవన్​ వద్ద మోడీ కాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఓవరాల్ గా 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు అయ్యారు. ముందుగా మోడీ ప్రధానిగా ప్రమాణం చేసారు. ఆ తర్వాత 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ, ఏపీ నుంచి ఒకరు బీజేపీ, ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కింది.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారు వీరే

రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మన్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావాల్, , సతీశ్ చంద్ర దుబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజందార్, సావిత్రీ ఠాకూర్, తోకన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష్ మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మొహోల్, జార్జ్ కురియన్, పబిత్ర మార్గరెటా, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అథవాలే, రామ్‌నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్, వి.సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ భగేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేశ్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి ఉన్నారు.