కేంద్ర మంత్రులకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రులకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:-కేంద్రంలో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా వారికి అభినందనలు తెలిపారు. "తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు.