ప్రాణం పోసిన మరో బ్రహ్మ

  • సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
  • అభినందించిన సైబరాబాద్ సీపీ

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఒక కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీ నగర్  ప్రాంతానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు.

దీంతో అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా అభినందించారు.