కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే రెండు లక్షల పంట రుణమాఫీ

కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే రెండు లక్షల పంట రుణమాఫీ

ముద్ర ప్రతినిధి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల పంట రుణమాఫీ చెయ్యడం జరుగుతుందని టిపిసిసి సభ్యులు,కొల్లాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చింతలపల్లి జగదీశ్వరరావు అన్నారు. ఆదివారం పానుగల్ మండల పరిధిలోని శాగాపూర్, కదిరేపాడు గ్రామాలలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తుందన్నారు.ఆడబిడ్డలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం,ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000 రూపాయలు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ తదితర పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టనుందని అన్నారు. శాగాపుర్ గ్రామ మాజీ ఎంపిటిసి సింగన్న యాదవ్ తో పాటు 20 మంది కాంగ్రెస్ పార్టీలో జగదీశ్వర్ రావు సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కృష్ణ,మండల వర్కింగ్ ప్రసిడెంట్ నరసింహ, సీనియర్ నాయకులు సుధాకర్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆది చంద్రయ్య,, ఎస్సీ సెల్ మండల అద్యక్షుడు బూతగల్ల స్వామి, రామకృష్ణ,, టక్కు శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు..