విశ్వకర్మ భగవాన్ ఉత్సవాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

విశ్వకర్మ భగవాన్ ఉత్సవాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: గత రెండు రోజుల నుండి కరీంనగర్ పట్టణం లోని కమాన్ కూడలి లో గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో జరుగుతున్న శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ బ్రహ్మోత్సవాల్లో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ, ధర్మకర్తల మండలి సంయుక్త ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో అర్చకుల వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం ప్రధాన న్యాయమూర్తి కి స్వాగతం పలికారు. ప్రతీ యేటా జరిగే ఉత్సవాలు, దేవాలయ చరిత్ర, నిత్య పూజల వివరాలను ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు వివరించి శాలువాతో సత్కరించారు.

 ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపెల్లి శ్రీనివాస్, ధర్మకర్త శ్రీరామోజు నాగరాజు,కోర్టు ఏఓ లక్ష్మికాంత్,ఆలయ ఈఓ ఉడుతల వెంకన్న,సీనియర్ న్యాయవాదులు శ్రీరామోజు కృష్ణార్జున చారి, తుమ్మనపెళ్ళి లక్ష్మణ్ రావ్,మూడపెల్లి అనురాద,కట్ట రమేష్,శ్రీరామోజు రజని,సుగుర్తి జగదీశ్వరాచారి, కనపర్తి దేవేందర్,బొజ్జ శ్రీలక్ష్మి,కార్పొరేటర్ నాంపెల్లి శ్రీనివాస్, వివిధ సంఘాల ముఖ్య నాయకులు రావుల శ్రీకాంత్, శ్రీరామోజు రవీంద్రచారి, తిప్పారపు శ్రీనివాస్, వంగళ శ్రీధర్,కట్ట జగన్,వేములవాడ రవీంద్రాచారి, మియ్యాపురం బ్రహ్మం,శ్రీరామోజు వెంకటేశ్వర్లు,అనసూరి రమేష్,కన్నోజు మహేష్,ఆలయ క్లర్క్ శ్రీనివాస్,తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.