ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఘన స్వాగతం..

ఎమ్మెల్సీ కోటిరెడ్డికి ఘన స్వాగతం..

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ  కార్యక్రమాల సమన్వయ కమీటీ ఇంచార్జిగా ఎన్నికైన ఉమ్మడి నల్గొండ జిల్లా శాసన మండలి సభ్యుడు ఎం.సీ కోటిరెడ్డి మంగళవారం జనగామకు వచ్చారు. జిల్లా కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జనగామ జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో పాటు ఇతర నాయకులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.