సీఎంని కలిసిన ఎమ్మెల్యే

సీఎంని కలిసిన ఎమ్మెల్యే

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని, మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా చేయాలని, ఇటీవల కురిసిన భారీవర్షాలకు  నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్ట్స్ మరమ్మత్తులు , పురారుద్దరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.