పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి పట్ల ఏఐ పిఎస్ఓ ఖండన
![పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి పట్ల ఏఐ పిఎస్ఓ ఖండన](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a81e0e5768c.jpg)
- అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తున్నట్లు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు తొగిటి మురళి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ధర్మభిక్షం భవన్ లో శుక్రవారం ఏఐపీఎస్ఓ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడుతూ పాలస్తీనా పై ఇజ్రాయిల్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రపంచశాంతికి విఘాతం కలిగేలా ఇజ్రాయిల్ చర్యలు ఏమాత్రం సముచితం కాదని తెలిపారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ ప్రభుత్వం జరుగుతున్న దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని కావున తక్షణమే ఆ దాడిని నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత శాంతి సంఘం సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మ గాని శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు చామల అశోక్, అనంతుల మల్లేశ్వరి, జిల్లా సహాయకార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, గోపగాని రవి, నరేష్, నరేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.