ఆస్ర్టేలియాలో ఆలయంపై దాడి.. ఖలిస్థానీ మద్దతుదారుల బీభత్సం

ఆస్ర్టేలియాలో ఆలయంపై దాడి.. ఖలిస్థానీ మద్దతుదారుల బీభత్సం

న్యూఢిల్లీ: ఆస్ర్టేలియాలో హిందూ దేవాలయాలపై మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం బ్రిస్బేన్​లోని లక్ష్మి నారాయణ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఈ దాడులపై ఆలయ పూజారి సతీందర్​ శుక్లా మాట్లాడుతూ.. కొందరు స్థానికులు, భక్తులు ఉదయం తనకు ఫోన్​ చేశారని దేవాలయంలోకి కొందరు దుండగులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నారని తెలిపారన్నారు. సిక్​ఫార్​జస్టిస్​(ఎస్​ఎఫ్​జే)కు సంబంధించిన కొందరు ఆస్ర్టేలియాలో ఇలాంటి దాడులకు పాల్పడి పూర్తి భారతీయులను ఉగ్రవాదులకు చిత్రీకరించే చేసే ప్రయత్నంలా కనిపిస్తుందని ఆస్ర్టేలియాలో హిందూ మానవాధికారుల అధికారిణి సారా గేట్స్​ అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు కూడా శివుడు, విష్ణువు మందిరాలను ధ్వంసం చేశారు. గోడలపై ఉన్న దేవుళ్ల ఫోటోలను సైతం చించి పడవేశారు. ఆస్ర్టేలియాలోని తమిళనాడు వాసులు అత్యంత వైభవంగా నిర్వహించుకునే ‘థాయ్​పొంగల్’ వేడుకలో భక్తుల దర్శనం అనంతరం గుర్తుతెలియని దుండగులు జనవరి 16న ఆలయంపై దాడి చేశారు. అంతకుముందు జనవరి 12న కూడా మరో స్వామినారాయణ మందిరంలో విధ్వంసం సృష్టించారు దుండగులు. మెల్​బోర్న్​లో ఉన్న ఇస్కాన్​శ్రీకృష్ణ ఆలయాంలో కూడా దుండుగులు విధ్వంసం సృష్టించారు. ఆలయాలపై దాడుల విషయంపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. దేవాలయాలపై దాడుల అంశాన్ని ఇటీవలే కాన్​బెర్రీలో జరిగిన ఓ సదస్సులో కూడా భారత విదేశాంగ కార్యదర్శులు అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.