రెండు బస్సులు ఢీ ఐదుగురి మృతి

రెండు బస్సులు ఢీ ఐదుగురి మృతి
  • 74 మందికి గాయాలు

తమిళనాడు: తమిళనాడులో రెండు బస్సులో ఢీకొని ఐదుగురు దుర్మరణం పాలయ్యయారు, 77 మందికి గాయాలయ్యయాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని కడలూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాల వేగానికి బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డవారిలో ఎకువగా స్కూలు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. స్థానికులు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయాలైన 74 మందిని కడలూరు ఆసుపత్రిలో చేర్చించారు. ఇందులో పలువురికి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బస్సులు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడింది. బస్సులోపల చిక్కుకున్నవారిని బయటికి తీసేందుకు పోలీసులు క్రేన్లను రప్పించాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణం వేగమే అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.