కాంగ్రెస్ నాయకుని పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు

కాంగ్రెస్ నాయకుని పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి... పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు

మెట్‌పల్లి ముద్ర: కాంగ్రెస్ నాయకుని పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన మెట్‌పల్లి పట్టణంలో కలకలం రేపింది...స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...కోరుట్ల మండలం అయిలపూర్ గ్రామానికి చెందిన రజాక్ అనే కాంగ్రెస్ నాయకుడు దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ప్రధాన అనుచరుడి పై పట్టణంలోని ఎస్సారెస్పీ కెనాల్ రేగుంట రోడ్ లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి రోడ్డు పై పడవేసి వెళ్ళారు. రక్తపు మడుగులో పడి ఉన్న రజాక్ ను గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందించగా పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.... ఈ విషయం పై ఎస్ ఐ శ్యామ్ రాజ్ ను వివరణ కోరగా తనకు ఎటువంటి పిర్యాదు అందలేదని తెలిపారు.కాగా దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది..