మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్రవంతిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ
ముద్ర, ఎల్లారెడ్దిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ స్రవంతి తో పాటు పదిమంది మహిళ సిబ్బందిని బుధవారం మహిళా దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సన్మానించింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి రోగులకు సేవ చేయడం జరిగిందన్నారు. వారి కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా కరోనా వ్యాధి బారిన పడిన రోగులకు మనోధైర్యం కల్పిస్తూ సమయానికి మందులు ఇవ్వడం జరిగిందన్నారు. వారికి చేసిన సేవను ఎంత కొనియాడిన తక్కువేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి ,నాయకులు చెన్ని బాబు, నాగరాజు ,గంట బుచ్చా గౌడ్, చెరుకు ఎల్లయ్య, సతీష్, మల్లారెడ్డి, రామచంద్రం, పందిర్ల శ్రీనివాస్, రఫిక్, కటిక రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.