పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దాసరి మనోహర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన  బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు మాజీ ఉప సర్పంచ్ పెండ్యాల తిరుపతి రెడ్డి, వార్డు మెంబర్ పెండ్యాల వెంకట రమణారెడ్డి, తుంగ మల్లయ్య, ఒలిపి రెడ్డి పోశెట్టి, హబీబ్, శంకర్, శ్రీనివాస్ లు పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్ కుమార్. హనుమంతు, కరుణాకర్ రెడ్డి, రాజు, రామ కృష్ణ, మల్లారెడ్డి, షరీఫ్,  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.