దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసహనం
![దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసహనం](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643a6602c0b44.jpg)
దర్యాప్తు సంస్థల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. కోర్టులకు ఈడీ, సీబీఐ తప్పుడు సమాచారం ఇస్తున్నాయన్నారు. కొందరి పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని ఈడీ టార్చర్ చేసిందన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయిన నిందితులను దర్యాప్తు సంస్థలు తీవ్రంగా వేధిస్తున్నాయన్నారు. 100 కోట్ల రూపాయలు అంటారు. ...ఒక్క పైసా దొరకలేదు. మోదీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెబితే సీబీఐ నమ్ముతుందా? కొత్త పాలసీ వల్ల రాష్ట్రానికి 50 శాతం ఆదాయం పెరిగిందన్నారు.