ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే ఉంది - ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే ఉంది - ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

హైదరాబాద్ : బీఆర్‌కే భవన్‌లో మీడియా సెంటర్‌ని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు మరో రెండు మూడు నెలలు మాత్రమే సమయం ఉందన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగిస్తుందన్నారు. జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. యంగ్ ఓటర్స్‌తో 6.99 లక్షలు కొత్త ఓటర్లు నమోదు చేయించామన్నారు. మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతుందని వికాస్ రాజ్ అన్నారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందని వెల్లడించారు. కేంద్ర - రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నయన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. చాలా సమస్యలపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. 15 లక్షల అప్లికేషన్స్ ఫామ్ 8 వచ్చాయన్నారు. 4 వేల భవనాలు ఇప్పటికే గుర్తించి ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయన్నారు. వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఉంటున్నాయని వికాస్ రాజ్ అన్నారు.