పెళ్లిరోజు సందర్భంగా పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహూకరణ
![పెళ్లిరోజు సందర్భంగా పేద విద్యార్థినికి ల్యాప్టాప్ బహూకరణ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6452756abf969.jpg)
జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్
ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సిరిసిల్లలో వేడుకను ఘనంగా నిర్వహించారు.నారాయణపూర్ గ్రామానికి చెందిన బీటెక్ చదువుతున్న పేద విద్యార్థిని బోల్గం సంజన కు అవసర నిమిత్తం ల్యాప్టాప్ అవసరం ఉందని గోవర్ధన్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే 70 వేలు విలువచేసే లాప్టాప్ ను బహుకరిస్తానని పేర్కొన్నారు. వెంటనే నారాయణపూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో కొండా రమేష్, కదిర భాస్కర్ గౌడ్ పాముల దేవయ్య, లింగాల నరేందర్, జవాజి మహేష్, పాముల దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.