హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని అడ్డగించిన  బొత్తలపాలెం గ్రామస్తులు

  • దళిత బంధు అందరికీ ఇవ్వాలంటూ నినాదాలు
  • హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీవీడు మండల కేంద్రంలో ఘటన

ముద్ర పాలకవీడు: హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డిని బొత్తల పాలెం గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. ఈ సంఘటన పాలక వీడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. జాన్ పహాడ్ దర్గా వద్ద మౌలిక వసతుల కల్పనకు 50 లక్షల రూపాయలతో పనుల ప్రారంభానికి గాను శాసనసభ్యులు సైదిరెడ్డి వెళుతున్నాడన్న వార్త తెలుసుకున్న బొత్తల పాలెం గ్రామ దళితులు ఒక్కసారిగా పాలక వీడు కేంద్రానికి ఎమ్మెల్యే చేరుకోగానే మహిళలు పురుషులు నినాదాలు ఇస్తూ రోడ్డుపై గందరగోళం సృష్టించారు. గ్రామంలో దళిత బంధు కొందరికి ఇచ్చారని తాము దాదాపు 50 పైగా కుటుంబాల దళితులం ఉంటామని కొంతమందికే ఇవ్వటం ఏమిటని ప్రశ్నిస్తూ మెరుపు వేగంతో ఆందోళనకు దిగారు ఈ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీపీ గోపాల్ నాయక్ మద్దతు తెలిపారు సిపిఎం మండల కార్యదర్శి అనంత ప్రకాష్ ఆధ్వర్యంలో దళిత మహిళలు పురుషులు ఎమ్మెల్యేను అడ్డుకొని నినాదాలు చేశారు ఎస్సై లింగయ్య ఆధ్వర్యంలో పోలీసులు కొద్దిసేపటి తర్వాత పరిస్థితులను చక్కదిద్దారు